ఏపీ బడ్జెట్: రూ. 2 లక్షల కోట్ల మార్క్ ను తాకనున్న బడ్జెట్


2019 ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జంబో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం శాసనసభకు సమర్పించనున్న 2018-19 రాష్ట్ర బడ్జెట్‌ భారీ మొత్తంలో ఉండబోతోంది. ఏపీ 2018-19 వార్షిక బడ్జెట్ రూ. 2 లక్షల కోట్ల మార్క్ ను తొలిసారిగా అధిగమించనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.

ఈ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట వేయనున్నారు. జలవనరులకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు, ఉపాధికి, పింఛన్లకు పెద్ద మొత్తాలు ప్రతిపాదించనున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతికి కూడా ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని సమాచారం. జలవనరులకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు, ఉపాధికి, పింఛన్లకు పెద్ద మొత్తాలు ప్రతిపాదించనున్నారని తెలుస్తుంది.