టాలీవుడ్లో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు క్రిష్. క్రిష్ సినిమాలు ఎప్పుడూ విమర్శకుల మనసుల్ని గెలుచుకొన్నాయి. నందమూరి బాలకృష్ణ 100వ సినిమాని చిరస్మరణీయంగా మలచాడు. తెలుగు చక్రవర్తి చరిత్రతో శాతకర్ణిని నిర్మించి భారీ విజయం సాధించిన క్రిష్… ఇప్పుడు భారత దేశ చరిత్రలో ధీరవనితగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ లక్ష్మీబాయ్ జీవితాన్ని చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత క్రిష్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నాడని తెలిసింది. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఆయన చేస్తోన్న ‘నా పేరు సూర్య ‘ షూటింగు పరంగా ముగింపుదశకి చేరుకుంది. దాంతో ఆయన తదుపరి సినిమా ఏ దర్శకుడితో వుండనుందా అనే ఆసక్తి అభిమానుల్లో రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో క్రిష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఇటీవల క్రిష్ వినిపించిన ఒక కథ అల్లు అర్జున్ కి బాగా నచ్చేసిందనీ, ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుందని తెలిసింది.