శతమానం భవతి లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ శ్రీనివాస కళ్యాణం. నితిన్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో రాశీ ఖన్నా, నితిన్ నిజమైన దంపతుల్లా చక్కగా కన్పిస్తున్నారు.
నందిత శ్వేత, ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. మరోపక్క నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాతో బిజీగా ఉన్నారు. కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.