శ్రీదేవి అంటే దర్శకుడు రామ్గోపాల్వర్మకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తాను దర్శకుడు అయ్యింది కూడా శ్రీదేవితో సినిమా తీసేందుకేనని చెబుతుంటాడు వర్మ ఇటీవల దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి కన్నుమూశారు . ఆమె మరణం వర్మను తీవ్రంగా కలచివేసింది. ఆమెనే కలవరిస్తూ అనేక ట్వీట్లుపెట్టాడు వర్మ.
కాగా బయోపిక్లను తీయడంలో సిద్ధహస్తుడైన వర్మ.. శ్రీదేవిపై కూడా ఓ బయోపిక్ను తీస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో వర్మ స్పందించారు. తాను శ్రీదేవి బయోపిక్ తీయడం లేదని స్పష్టం చేశారు. ‘శ్రీదేవి బయోపిక్ తీస్తున్నాన్నంటూ కొన్ని మీడియా వర్గాలు రాస్తున్న కథనాలు అవాస్తవం. ఆ ప్రయత్నం అవివేకం. ఎందుకంటే శ్రీదేవిలా ఆ పాత్రను పోషించగల నటి ఒక్కరూ లేరు’ అని క్లారిటీ ఇచ్చారు వర్మ.