హర్మన్‌ప్రీత్‌ ఇప్పుడు డీఎస్పీ


భారత మహిళల టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కల నెరవేరింది. గురువారం ఆమె తనకిష్టమైన పోలీసు వృత్తిలో చేరింది. పంజాబ్‌ పోలీసు శాఖలో డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టింది.

గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై సంచలన ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్.. భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. దీంతో.. అప్పట్లో పంజాబ్ ప్రభుత్వం ఆమెకి పోలీస్ డీఎస్పీ జాబ్‌ని ఆఫర్ చేసింది. కానీ.. అప్పటికే రైల్వేలో ఉద్యోగం చేస్తున్న హర్మన్‌ప్రీత్ ఐదేళ్ల కాలానికి బాండ్‌పై సంతం చేసి ఉండటంతో.. ఆమెని రిలీవ్‌ చేసేందుకు నిబంధనలు అడ్డొచ్చాయి. ఐతే పంజాబ్‌ ముఖ్యమంత్రి కలగజేసుకుని.. రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాయడంతో సమస్య పరిష్కారమైంది.

కాగ పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, డీజీపీ సురేశ్‌ అరోరా ఆమె దుస్తులపై నక్షత్రాలను అమర్చడం విశేషం