‘ఛలో’ సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న నాగశౌర్య .. ప్రస్తుతం ‘అమ్మమ్మగారిల్లు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా షామిలి నటిస్తోంది. ఇప్పుడు మళ్లీ తన సొంత బ్యానర్లో రెండో సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాడు.
వంశీ పైడి పల్లి దగ్గర శిష్యుడిగా పనిచేసిన చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి ‘@ నర్తన శాల’ అనే పేరు ఖరారు చేశారు. మార్చిలో ముహూర్తం జరుపుకుని ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలెడతారు. పేరుని బట్టి ఇది పౌరాణికం అనిపిస్తుంది గానీ, పక్కా కమర్షియల్ సినిమా అని తెలుస్తోంది. ఆద్యంతం నవ్వులమయంలా సాగుతుందని, నాగశౌర్యకి మరో డిఫరెంట్ మూవీ అవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కథానాయికతో పాటు ఇతర నటీనటులు ఎవరనే వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.