నాగశౌర్య మేటర్ పై సాయి పల్లవి రియాక్షన్

ఎంసిఎ సినిమా షూట్ టైమ్ లో హీరో నానికి హీరోయిన్ సాయిపల్లవికి పొసగలేదని వార్తలు వచ్చాయి. అదంతా వట్టిదే అని, అవన్నీ గ్యాసిప్ లు అనీ కొట్టి పారేసినా, ఎంత వరకు నిజం అన్నది ఇండస్ట్రీ జనాలకు తెలిసిందే. ఇప్పుడు సాయి పల్లవి పై మరో ఫిర్యాదు. ఎఎల్ విజయ్ డైరక్షన్ లో ఓ తమిళ సిన్మాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కీలకం అని సాయి పల్లవిని తీసుకున్నాడు ఎఎల్ విజయ్. నాగశౌర్య హీరో.

ఈ సినిమా వషయంలో సాయిపల్లవి గురించి నాగశౌర్య మాట్లాడుతూ అసహనానికి లోనయ్యాడు. సమయానికి ఆమె షూటింగుకి రాకపోవడం వలన తాను చాలా ఇబ్బంది పడినట్టుగా చెప్పాడు. ఆయన చేసిన విమర్శలపై తాజాగా సాయిపల్లవి స్పదిమ్చింది,. ‘నాగశౌర్య చేసిన కామెంట్స్ గురించి చదవగానే నేను ‘కణం’ దర్శకుడికి ఫోన్ చేసి .. తన వలన ఎవరైనా ఇబ్బంది పడ్డారా అని అడిగాను .. అలాంటిదేం లేదని ఆయన చెప్పారు’. నా వలన ఎవరైనా ఇబ్బంది పడితే అది అవతలవారికన్నా నాకే ఎక్కువ బాధ కలిగించే విషయం అవుతుంది. అయినా నేను నాగశౌర్య వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను’ అని సున్నితంగా తప్పించుకుంది సాయి పల్లవి,