శ్రీదేవి మృతి పెద్ద మిస్టరీగా మారింది. మొదట ఆమె గుండెపోటుతో మరణించారని భావించినా.. ఆమె ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి చనిపోయిందని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. దీంతో ఈ కేసును దుబాయ్ పోలీసులు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేశారు. దీంతో ఇంకా అనేక ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉన్నందున మరింత జాప్యమయ్యే అవకాశముంది.
ఇప్పటికీ శ్రీదేవి భౌతికకాయం దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వద్దే ఉంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసును పునః విచారణ చేస్తోంది. శ్రీదేవి మృతిపై మరింత విచారణ అవసరమని, మృతదేహాన్ని ఈరోజు అప్పగించలేమని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.