శ్రీదేవి పై అలాంటి తప్పుడు వార్తలు వద్దు


శ్రీదేవి చనిపోయిందనే వార్త ఇంకా నమ్మశక్యంగా లేదు. ఆమె మరణం ఎలా సంబధించిదన్న దానికి పై ఎవరికీ ఇంకా క్లారిటీ లేదు. అయితే ఆమె అతిగా డైట్ పిల్స్ తీసుకోవడం వల్ల, కాస్మొటిక్ సర్జరీలు ఎక్కువగా చేయించుకోవడం వల్లనే ఆమె కన్నుమూసిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె ఎక్కువగా సౌందర్యకి సంబధించిన మందులు వాడుతున్నారని, వీటి వల్ల ఆమెకు సడెన్ గా గుండెపోటు వచ్చి ఉండొచ్చుని అంటున్నారు.

అయితే ఈ వార్తలపై ఫైర్ అయ్యింది ఏక్తాకపూర్. ”రాక్షసుల్లా మాట్లాడకండి. నాకు తెలిసిన వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఎటువంటి హృద్రోగ సమస్యలు లేకపోయినా, ఎలాంటి సర్జరీలు చేయించుకోకపోయినా గుండెపోటు వస్తుంది. చావుపుట్టుకలు విధి నిర్ణయిస్తుంది. మీరు ఏవేవో ఊహించుకోవద్దు. ధృడమైన మహిళల హృదయాలు బలహీనంగానే ఉంటాయి’ అని ఆవేదన వ్యక్తం చేసింది ఏక్తా.