శ్రీదేవి, జూ. ఎన్టీఆర్ .. ఓ అభిమాని కథ

భారతీయ వెండి తెరపై తనదైన ముద్ర వేసిన శ్రీదేవి హఠాన్మరణం చిత్రసీమను కలచివేసింది. శ్రీదేవి ఇకలేరు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఆమె దుబాయ్ లో కన్నుమూశారు. ఒక వివాహ కార్యక్రమానికి హాజరు కావడానికి కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లిన ఆమె శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో మృతి చెందారు.

కాగ, శ్రీదేవి ఆకస్మిక మృతితో జూనియర్ ఎన్టీఆర్ కోరిక తీరకుండా ఉండిపోయింది. శ్రీదేవికి ఎంతో మంది అభిమానులు, వారిలో యంగ్ టైగర్ కూడా ఒకరు. తాతగారి సినిమాలు చూస్తూ స్పూర్తి పొంది నటుడైన జూనియర్ ఎన్టీఆర్ ను శ్రీదేవి కూడా ఆకర్షించారు. ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి చెబుతూ.. , శ్రీదేవి అంటే తనకు పిచ్చి అని, ఆమె తన కలల హీరోయిన్ అని , ఆమెకు ఇప్పటి నటీమణులెవ్వరూ సాటిరారని, ఆమె హీరోయిన్‌ గా చేయడానికి రెడీ అంటే ఆమెతో కలిసి నటించేందుకు తాను కూడా రెడీ అని, . అయితే ఆమె తనతో చేయరని చెప్పారు, ఎక్కడో ఒకచోట ట్రై చేసి, ఆమెను కనీసం ఒక్క పాటలో అయినా తనతో నటించేందుకు ఒప్పించాలి…చాలా కష్టమైనప్పటికీ శక్తిమేరకు కృషిచేస్తానని చెప్పారు ఎన్టీఆర్. ఐతే ఇప్పుడు ఆమె ఎవరికీ అందని లోకాలకు వెళ్లిపోయారు.