ఆపద్భాందవుడు కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నఓ యువకుడి ని ఆడుకున్నారు. ట్విట్టర్ ద్వారా స్పదించింది రూ.4 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు

వినాయక్‌అనే యువకుడు జనవరి 22న చి ఇంటికి వెళుతుండగా మేడ్చల్‌ వద్ద మినీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అతడి వైద్యం కోసం తల్లిదండ్రులు సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. మరో రూ.11లక్షలు ఖర్చవుతుందని ఆసుపత్రి వర్గాలు అంచనా వేశారు. అప్పటికే పెద్ద మొత్తం డబ్బు ఖర్చు చేయడంతో చేతిలో డబ్బు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విషయం గమనించిన వినాయక్ స్నేహితుడు విజయభాస్కర్‌ తన వంతు సాయం చేయాలనుకున్నాడు. వెంటనే రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు తన మిత్రుడిని ఆదుకోవాలని పరిస్థితిని వివరిస్తూ ట్వీట్‌ చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ సీఎం సహాయ నిధి నుంచి రూ.4 లక్షలు నిధులు మంజూరు చేయించి గొప్ప మనసు చాటుకున్నారు.