దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైయింది. టీమిండియాపై ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మనీశ్ పాండే (79), ఎంఎస్ ధోనీ (52) అర్ధశతకాలతో చెలరేగడంతో నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
వర్షం పడ్డ సెంచూరియన్ మైదానంలో ఔట్ఫీల్డ్ తడిగా ఉండి బంతి వేగంగా వెళ్లకున్నా ఈ జోడీ అద్భుతంగా ఆడింది. కష్టాల్లో పడ్డ జట్టును ఆదుకుంది. ఐదో వికెట్కు అజేయంగా 56 బంతుల్లోనే 98 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది.
అయితే అనంతరం బ్యాటింగ్ ప్రారభించిన దక్షిణాఫ్రికా జట్టులో హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు. మొదట హెన్రిచ్ క్లాసెన్ (69: 30 బంతుల్లో) అద్భుత అర్ధశతకంతో రాణించగా, డుమిని (64 ) నాటౌట్గా నిలిచి విజయ లాంఛనాన్ని ముగించాడు. భారత్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఇంకా ఎనిమిది బంతులో వుండగానే ముగించింది సఫారీ జట్టు