అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మరో రికార్డ్ నెలకొల్పాడు తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఐసీసీ అటు టెస్టు బ్యాట్స్మెన్ల జాబితాలో 912 పాయింట్లతో రెండో ర్యాంకులో కొనసాగుతోన్న కోహ్లీ వన్డేల్లోనూ 909 పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. టెస్టు, వన్డే ఇలా రెండు ఫార్మాట్లలో ఏకకాలంలో 900లకు పైగా పాయింట్లు సాధించిన రెండో బ్యాట్స్మెన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
మరోవైపు ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో 122 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లకు టాప్-10లో చోటు దక్కింది. బౌలింగ్ విభాగంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా 787 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకాడు