అనసూయే రంగమ్మా..

రామ్‌చరణ్‌, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈ సినిమా మొదటి పాట వచ్చింది. ఎంత సక్కగున్నావె.. అని సాగిన ఈ పాట చాలా క్యాచిగా వుంది. త్వరలోనే ఈ సినిమా నుండి రెండో పాట విడుదల చేయబోతున్నారు. రంగమ్మ మంగమ్మా అంటూ సాగే పాట ఇది.

ఈ సినిమాలో అనసూయ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయపేరు రంగమ్మ అని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ‘రంగస్థలం’ సినిమాను నిర్మిస్తోంది. దేవిశ్రీ మ్యూజిక్ అందించాడు. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. సుకుమార్ చెర్రీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.