ఆమెకు సారీ చెప్పిన వర్మ


ఎస్టీ పేరుతో శృంగారమే ప్రధానాంశంగా సినిమా తీసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మ‌ణి అనే ఓ మ‌హిళ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే . జీఎస్టీ సినిమాపై టీవీ చర్చలో భాగంగా సామాజిక మనిపై చేసిన వ్యాఖ్యలపై వర్మ స్పందించారు.

ఇవాళ ఆయన జీఎస్టీపై నమోదయిన కేసులపై సీసీఎస్ స్టేషన్‌లో విచారణకు హాజరయిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం జరిగిన టీవీ చర్చలో పాల్గొన్న వర్మ.. మనిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. తనను కావాలని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. నిజంగా తన వ్యాఖ్యలకు ఆమె మనోభావాలు దెబ్బతింటే సారీ అనిచెప్పారు వర్మ.

ఈ విష‌యంపై స‌ద‌రు మ‌హిళ‌ మ‌ణి స్పందిస్తూ.. రామ్ గోపాల్ వ‌ర్మ క్ష‌మాప‌ణ‌ల‌ను తాను ఒప్పుకోన‌ని, ఆయ‌న సారీ త‌న‌కు వ‌ద్దని, వ‌ర్మ‌కి చ‌ట్ట‌ప్ర‌కారం ఎటువంటి శిక్ష ప‌డాలో అటువంటి శిక్ష ప‌డాల‌ని తేల్చిచెప్పారు.