మొత్తానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. ‘జీఎస్టీ’ వెబ్ సిరీస్కు సంబంధించిన కేసులో రాంగోపాల్వర్శ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. రాంగోపాల్వర్మపై సీసీఎస్లో సామాజికవేత్త దేవి, ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఓ ఛానల్లో జరిగిన జీఎస్టీ వెబ్ మూవీ చర్చలో వర్మ తనను దూషించారంటూ దేవి ఫిర్యాదు చేశారు.
జీఎస్టీ వ్యవహారం, ఓ మహిళను కించపరిచారన్న అభియోగాలపై వర్మను సైబర్ క్రైం పోలీసులు విచారిస్తున్నారు. వర్మ కెరీర్ లో ఎన్నో వివాదాలు. రాము ఎప్పుడు సినిమా తీసిన దాని చుట్టూ ఒక వివాదం ఉటుంది. బాలీవుడ్ అండర్ వర్ల్ ని కూడా కేలికిపారేసిన వర్మ.. ఎన్నో వివాదాలు కేసులు ఎదురుకున్నాడు. అయితే ఏనాడూ పోలీసు గడపఎక్కిన సందర్భాలు కనిపించవు. మొత్తంమ్మీద దేవిపెట్టిన కేసు మాత్రం ఆయన్ని పోలీసు గడపఎక్కినట్లు చేసింది.