అరుణ్‌జైట్లీతో కేసీఆర్‌ మీటింగ్

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్‌జైట్లీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం సాయం చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కోరారు. పాత 10 జిల్లాల్లోని 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినందుకు జైట్లీకి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కేంద్రం 2014-2017 వరకు మూడు ఆర్థిక సంవత్సరాలకు రూ.450 కోట్ల చొప్పున మొత్తం రూ.1,350 కోట్లు విడుదల చేసినట్లు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెల్లడించారు . ఎయిమ్స్‌కు అనువైన స్థలం, మౌలిక వసతులు కల్పిస్తామని కేసీఆర్ జైట్లీకి తెలిపారు . అలాగే 3.5శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కొనసాగించాలని జైట్లీని కోరారు.