సూపర్స్టార్ మహేశ్బాబు సోదరి మంజుల దర్శకురాలిగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఆమె దర్శకురాలిగా తెరకెక్కిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమైరా దస్తర్ జంటగా నటించారు. ఈ సినిమాకి మంజుల తమ్ముడు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించిన సంగతి తెలిసిందే. రేపు (శుక్రవారం) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మహేష్ వాయిస్ తో ఓ టీజర్ ని విడుదల చేశారు.
ట్రైలర్లో..‘హలో నేచర్.. మేము వచ్చేస్తున్నాం. మమ్మల్ని మేం తెలుసుకోవడానికి. ఐ లవ్యూ’ అని అమైరా డైలాగ్ చెప్పడం..ఇందుకు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తూ..‘ఐ లవ్యూ టూ. ఇప్పుడే కాదు. ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నన్ను ప్రేమ అనచ్చు. ప్రకృతి అనచ్చు. నువ్వూ నేను వేరు కాదు. నువ్వు ప్రేమ, నేనూ ప్రేమ.’ అని చెప్తున్న డైలాగ్ నిజంగా మనసుకు నిచ్చింది.