నాగ్, నాని.. ఓ హీరోయిన్ ఫిక్స్

నాగార్జున .. నాని కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కనుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. చిత్రం ఈ నెల‌ 24 నుంచి ప‌ట్టాలెక్క‌నుంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో నానికి జోడీగా క‌న్న‌డ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ న‌టించ‌నుంద‌ని తెలిసింది. తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’లోనూ, కన్నడ ఫిలిం ‘యూ టర్న్’లోనూ త‌న న‌ట‌న‌తో ఆకట్టుకున్న శ్ర‌ద్ధా ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ప్రస్తుతం నాగార్జున వర్మ సినిమాతో బిజీగా ఉండగా, నాని మేర్లపాక గాంధీ సినిమా చేస్తున్నాడు.