పైరసీ భూతం సినీ పరిశ్రమను వెంటాడుతోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పైరసీని ఆపడం సాధ్యపడటం లేదు. ఎంత అప్రమత్తంగా వుంటున్నా ఏదో మార్గంలో పైరసీ పట్టిపీడిస్తుంది. రోజురోజుకీ మితిమీరిపోతున్న పైరసీ సమస్యకు అడ్డుకట్ట వేయాల్సిందిగా రచయిత కోన వెంకట్.. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కోరారు.
ఇటీవల విడుదలైన తెలుగు సినిమాలను ‘మూవీ రూల్స్’ అనే వెబ్సైట్ పైరసీ చేస్తోందని దీని వెనుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ట్విటర్ వేదికగా కోరారు.
కేటీఆర్ సర్..‘మూవీరూల్స్’ అనే వెబ్సైట్ను నడుపుతున్నవారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నా. ఈ వెబ్సైట్ కారణంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించండి” అంటూ కోన వెంకట్ ట్వీట్లో వేడుకున్నారు.