కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గత నెల జమ్ము కశ్మీర్ లోని షోపియాన్లో భారత సైన్యం ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మేజర్ ఆదిత్యాకుమార్పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, దీనిపై కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ విషయంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.