ఆరు వన్డేల సిరీస్లో కీలకమైన నాలుగో వన్డే నేడు న్యూలాండ్స్ వేదికగా ఆరంభమైంది. దీనిలో భాగంగా టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకొన్నాడు.
10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 53 పరుగులు చేసింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న సఫారీ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ భారత బ్యాట్స్మెన్ పరుగులు సాధిస్తున్నారు. చివరి టెస్టులో టీమిండియాకు విజయాన్నందించిన జొహానెస్బర్గ్లోనే సిరీస్ను నిర్ణయించే వన్డే జరుగుతుండటం విశేషం.
కాగా వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ రోహిత్ శర్మ కీలకమైన ఈ మ్యాచ్లోనూ కేవలం 5 పరుగులు(13బంతుల్లో) మాత్రమే చేసి నిరాశపరిచాడు. గత మ్యాచ్ తరహాలోనే ఈ వన్డేలోనూ రబాడ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.