ఈమధ్య కాలంలో… బాలీవుడ్నే కాదు, యావత్ సినీ ప్రపంచాన్నీ కుదిపేసిన పేరు…. పద్మావత్! వివాదాలు, విమర్శలతో పద్మావత్ పేరు మార్మోగిపోయింది. ఎన్నో వివాదాలు ఎదురుకుని ఈ సినిమా ఎట్టేకలేకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి , విజయాన్ని సాధించింది.
కాగా ఈ సినిమా వివాదంలో దీపికా పదుకొణెను చంపుతామని కర్ణిసేన బెదిరించినప్పుడు తనకు పట్టలేనంత కోపం వచ్చిందని రణ్వీర్ సింగ్
లేటెస్ట్ గా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా వుంది. ”దీపినకు బెదిరించినప్పుడు కోపంతో రగిలిపోయా దీనిపై మాట్లాడాలని, ఏదో ఒకటి చేయాలని గట్టిగా అనుకున్నా. కానీ నోరువిప్పొద్దని ఆదేశించారు. గౌరవించి, మౌనంగా ఉన్నా. నేనేం చేసినా దర్శక నిర్మాతల పరిస్థితి మరింత క్లిష్టంగా తయారౌతుంది. నాకది ఇష్టం లేదు. అందుకే మౌనంగా వున్న’ అని చెప్పుకొచ్చాడు రణ్వీర్.