జేపీని కలవనున్న పవన్

ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం ‘జేఏసీ’ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతోంది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జేఏసీ’ ప్రపోజల్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలు కాకుండా, మిగితా అన్నీ పార్టీలతో పాటుగా మేధావులని కలుపుకొని ‘జేఏసీ’ ఏర్పాటు చేయబోతున్నట్టు పవన్ తెలిపారు.

ఇప్పుడా దిశగా పనులు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం పవన్ లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్‌ నారాయణ్‌ను కలవనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ‘జేఏసీ’ ఏర్పాటుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కుదిరితే.. జేఏసీ పై ఓ ప్రకటన కూడా రావొచ్చు. మరీ.. జేఏసీలో ఏయే పార్టీలు ఉండబోతున్నాయి. ఏ నేతలు కీలక పాత్ర పోషించబోతున్నారు ?? అనేది త్వరలోనే తెలియరానుంది.