సాయి పల్లవి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.

ఫిదా చిత్రం తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీ సాయి పల్లవి. మొదటి చిత్రం తోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఎంసిఏ మూవీ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక కోలీవుడ్ లో సైతం అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. సూర్య , ధనుష్ వంటి స్టార్స్ పక్కన జోడి కట్టే ఛాన్సులు వచ్చాయి. తాజాగా అమ్మడి రెమ్యూనరేషన్ ఎంతో బయటకొచ్చింది.

ప్రస్తుతం ఈమె తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. దీని కోసం రూ.1.4 కోట్ల దాకా పారితోషకం అందుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం గ్లామర్ ఉన్న స్టార్ హీరోయిన్లు మాత్రమే ఈ స్థాయిలో పారితోషకం తీసుకుంటారు. ఐతే సాయిపల్లవి గ్లామర్ తో ఎప్పుడూ పెద్దగా ఆకర్షించింది లేదు. కేవలం తన నటన తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఈమె పక్కన స్టార్ హీరో నటించిన కానీ ఈమె నటన ముందు తేలిపోవాల్సిందే..అంతలా అమ్మడు నటన తో ఆకట్టుకుంటుంది. ఇక తెలంగాణ లో అయితే ఈమె నటన కు అంత ఫిదా అవుతున్నారు. అందుకే ఈమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు.