కొత్త పార్టీ ప్రకటించిన కోదండరాం

తెలంగాణలో మరో కొత్త పార్టీ . ఈ కొత్త పార్టీని ఏర్పాటును జెఏసి ఛైర్మన్‌ కోదండరాం ప్రకటించారు. రాజకీయ పార్టీ పెట్టాలని వస్తున్న డిమాండ్‌ను సమ్మతిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరాం వెల్లడించారు. ఆదివారం టీజేఏసీ కోర్‌కమిటీ మీటింగ్ జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కోదండరాం.. పార్టీ ఏర్పాటుచేసే పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాజకీయ వేదిక కోరుతున్నారని చెప్పారు. ఇదే సమయంలో జేఏసీ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు

రైతుల కోసం పెద్ద పోరాటమే చేయాలని నిర్ణయించామని, రాజకీయ పార్టీ పెట్టాలని ప్రజలంతా కోరుతున్నారని, అది లేకపోతే తమ పోరాటానికి ఫలితం లేదని, పార్టీ పెట్టాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని, రాజకీయాల్లో మార్పు కోసమే పార్టీ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలో పార్టీ పేరును ప్రకటిస్తామని, ప్రజల సహకారంతోనే పార్టీ నడపాలి అని నిర్ణయించినట్లు వెల్లడించారు.