సఫారీని చిత్తు చేసిన భారత్ .. 2-0తో ఆధిక్యం

టెస్టు సిరీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటోంది కోహ్లీసేన . సెంచూరియన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఆతిథ్య సౌత్ ఆఫ్రికా జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారతజట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. మణికట్టు స్పిన్‌ ద్వయం యజువేంద్ర చాహల్‌ (5/22), కుల్‌దీప్‌ యాదవ్‌ (3/20) దెబ్బకు ఆతిథ్య జట్టు 32.2 ఓవర్లకు 118 పరుగులకే కుప్పకూలింది.

ఛేజింగ్ లో శిఖర్‌ ధావన్‌ (51), సారథి విరాట్‌ కోహ్లీ (46) అజేయంగా నిలిచి జట్టుకు ఈజీ విజయం ఆడించారు; దింతో సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది భారత్.