జనవరిలో ‘ఒంగోల్ గిత్త’

‘దేవదాసు, రెడీ, మస్కా, రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ పత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా భోగవల్లి బాపినీడు సమర్పణలో సినీ చిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒంగోల్ గిత్త’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ – “మా ‘ఒంగోల్ గిత్త’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ చివరి వారంలో ఆడియో రిలీజ్ చేసి జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. బొమ్మరిల్లు, పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో వుండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్టుగా ఎనర్జిటిక్ గా వుంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి” అన్నారు.
రామ్, కృతి కర్బందా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బహ్మానందం, ఆహుతి ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు.