కొనసాగుతున్న కేశవ్ ఆందోళన

తుంగభద్ర ఎగువ కాలువ నుంచి గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ)కు నీరు విడుదల చేయూలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే (తెదేపా) పయ్యావుల కేశవ్ నిన్న రాత్రి కాలువ వద్ద చేపట్టిన ధర్నా ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఈ ఉదయం కాలువ గేట్ల వద్దనే కేశవ్ స్నానం చేసి రెండో రోజు ఆందోళనకు సిద్దమయ్యారు. జీబీసీకి సాగునీరు విడుదల చేయకపోతే వేలాది ఎకరాల్లో పంటలు చేతికందకుండా పోయే ప్రమాదముందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీరు విడుదల చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని పయ్యావుల స్పష్టం చేశారు.