సీబీఐ కోర్టులో మోపిదేవి బెయిల్ పిటిషన్

మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ సీబీఐ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న తనకు దీక్ష విరమణకు శబరిమలై వెళ్లేందుకు గానూ ఈనెల 24 నుంచి జనవరి 2వ తేదీ వరకూ అనుమతి ఇవ్వాలని మోపిదేవి పిటిషన్ లో పేర్కొన్నారు. 18 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నానని కూడా మోపిదేవి సీబీఐ కి సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్నారు.