ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిల్లర వ్యాపార రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్.డి.ఐ)లను అనుమతించడాన్ని సమర్థించుకున్నారు. . లూథియానాలో పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఎఫ్.డి.ఐ ల వల్ల బాటలు పడతాయన్నారు మన్మోహన్ సింగ్. ఈ విషయంలో ఎన్డిఏ భాగస్వామ్యపక్షం అకాళీదళ్ నుంచి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ప్రశంసలు లభించాయి. ఆయనను పంజాబ్ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రశంసలతో ముంచెత్తారు. మన్మోహన్ సింగ్ ప్రపంచంలోనే గొప్ప పేరు ప్రతిష్టలున్న ఆర్థికవేత్త అని పొగడ్తలతో ముంచెత్తారు ప్రకాశ్ సింగ్ బాదల్.