ప్రజల్లో పోలీసుల పట్ల విశ్వాసం పెరిగింది : సబిత

హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 1640 కేసులు ఎత్తివేశామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని హోంమంత్రి చెప్పుకొచ్చారు. నాలుగేళ్లలో నలభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని సబిత కొనియాడారు. ప్రజల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల పట్ల విశ్వాసం పెరిగిందని చెప్పారు. అలాగే పోలీసులు కూడా తమవద్దకు న్యాయం కోసం వచ్చే ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న భరోసా ప్రజలకు కల్పించాలని పోలీసులకు సూచించారు.