60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు : సీఎం

cm-kiran10వ విడత ఇందిరమ్మ బాటలో భాగంగా రంగాడ్డి జిల్లాలో మూడు రోజుల పర్యటనకు ముఖ్యమంత్రి కిరణ్ సోమవారం శ్రీకారంచుట్టారు. తొలిరోజు మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో పర్యటించారు. మహేశ్వరంలో జరిగిన బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తూ..ఈ సంవత్సరం ఇప్పటివరకు 60వేల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని, వచ్చే మూడు నెలల్లో మరో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ఏడాది రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా ప్రైవేట్ రంగంలో మరో 3.60 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కిరణ్ తెలిపారు.