సుప్రీంలో పొన్నాల అఫిడవిట్ దాఖలు

వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విడుదలైన 26 వివాదాస్పద జీవోల కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య సుప్రీంకోర్టులో ఈ రోజు (సోమవారం) ఉదయం అఫిడవిట్ దాఖలు చేశారు. ఎప్పుడు కోర్టు పిలిచిన విచారణకు తను పూర్తిగా సహకరిస్తానని తన పిటీషన్‌లో పొన్నాల పేర్కొన్నట్లు సమాచారం. అటు సీబీఐ, ఎస్వీఎన్ కే శర్మ, ఐఏఎస్ అధికారులు రత్నప్రభలు కూడా తమ అఫిడవిట్‌లు దాఖలు చేశారు. మరోవైపు సస్పెండ్ కు గురైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి అఫిడవిట్ దాఖలుకు సుప్రీం కోర్టు రెండు వారాల గడువు విధించింది. తుది పరిశీలనను సుప్రీం కోర్టు ఈ నెల 9 కి వాయిదా వేసింది.