నాసాలో ధోని ట్రైనింగ్

బాలీవుడ్‌ ‘ధోనీ’ సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అమెరికాలోని నాసా కేంద్రాన్ని సందర్శించాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘చందమామా దూర్‌కే’. ఈ చిత్రంలో సుషాంత్‌ వ్యోమగామి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం సుషాంత్‌ నాసాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. సినిమా కోసం నాసాలో శిక్షణ తీసుకుంటున్న తొలి బాలీవుడ్‌ నటుడు కూడా సుషాంతే కావడం గమనార్హం.

‘మా అమ్మ ఎప్పుడూ నేను వ్యోమగామిని అవ్వాలని అనుకుంటుండేది. వ్యోమగాములకు నాసాలో ఇచ్చే శిక్షణ గురించి తెలుసుకున్నాను. సినిమాలో నా పాత్ర కోసం నా ఫిట్‌నెస్‌ కోచ్‌ వద్ద ట్రైనింగ్‌ కూడా తీసుకుంటున్నాను.’ అంటూ ఓ ఫోటో ట్వీట్ చేశాడు సుశాంత్. ‘చందమామ దూర్‌ కే’ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత సంజయ్‌ పురాన్‌సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో నవాజుద్దీన్‌ సిద్ధిఖి, మాధవన్‌లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.