11,420 పోస్టుల భర్తీకి ఆమోదం

పలు శాఖల్లో 11,420 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల తర్వాత జరిగిన ఈ మంత్రివర్గ సమావేశానికి ఏడుగురు మంత్రులు హాజరుకాలేదు. విద్యాశాఖలో 11,142 ఉద్యోగాల భర్తీకి, వివిధ శాఖల్లోని 278 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 22 అంశాలకు సంబంధించి ఆర్థికశాఖలో రూ. 471 కోట్లు మంజూరు చేయాలని ఆమోదం తెలిపింది. అదే విధంగా నీలం తుపాను వల్ల జరిగిన నష్టంపై అధికారుల నుంచి వివరణ కోరింది.