దీపిక పదుకొణె, రణ్వీర్ సింగ్ .. వీళ్ళ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రన్బీర్ కపూర్ నుండి దూరమైన తర్వాత రణ్వీర్ సింగ్ కు దగ్గరైయింది దీపిక. ఇప్పుడు వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో వున్నారు. ఇప్పుడు ఏకంగా ఒకే బిల్డింగ్ లో సెటిల్ అవ్వడానికి రెడీ అయ్యారు.
ముంబయిలోని ‘బో మోంద్’ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంది దీపిక. ఈ అపార్ట్మెంట్లో ఏకంగా 33 అంతస్తులు, మూడు టవర్లు ఉన్నాయి. అందులోనూ ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు ముంబయిలోనే అత్యంత ఖరీదైనవి.దీపిక ఉంటున్న ఫ్లాట్ పక్కనే రణ్వీర్ కూడా ఓ ఫ్లాట్ కొనుక్కుంటున్నాడట. ఇద్దరూ సినిమాల పరంగా బిజీగా ఉండడంతో పరస్పరం మాట్లాడలేకపోతున్నారని అందుకే ఒకే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారని బాలీవుడ్ టాక్.