దేవిశ్రీ ప్రసాద్ హీరోయిజం

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దేవి శ్రీ ప్రసాద్. వేదిక ఎక్కితే… పాట పాడుతూ, హుషారుగా స్టెప్పు లేస్తూ  సందడి చేస్తుంటారు. దేవి హీరోగా మారనున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. “మంచి కధ వస్తే హీరోగా చేయడానికి సిద్దమే’ అని ఆయన కూడా చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు  ఆ సినిమాకి ముహూర్తం దగ్గర పడుతోంది. దేవిశ్రీ ప్రసాద్ కధానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో శ్రియ కధానాయికగా కనిపించనుందట. ఓ అగ్ర దర్శకుడు… ఈ ప్రాజెక్ట్ టేక్ అప్ చేస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి. ఆల్ ది బెస్ట్ టూ దేవి శ్రీ….