నా
గచైతన్య లేటెస్ట్ చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ సినిమా రకుల్ కెరీర్ లో కీలకం కానుందట. నాగచైతన్యతో పోలిస్తే.. ఈ సినిమాలో రకుల్ పాత్ర ఆకట్టుకొనేలా ఉందట. ఫస్టాఫ్లో చైతూ పాత్రని రకుల్ అన్నివిధాలా డామినేట్ చేసేసిందని టాక్.
దీనిపై రకుల్ మాట్లాడుతూ.. భ్రమరాంబ పాత్ర నా కెరీర్లో ఓ మైలు రాయి. ఇప్పటి వరకూ ఇలాంటి పాత్రలో నేను నటించలేదు. నా నటన నాకే కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక యెత్తు.. ఈ సినిమా మరో ఎత్తు”అని చెప్పుకొచ్చింది రకుల్. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందించాడు.