ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో భేటీ అయిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
ఈ మంత్రివర్గ సమావేశంలో జీఎస్టీ బిల్లుకి ఆమోదం తెలపనున్నారు. రేపు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. అంతేగాక, ఏపీ రెంటల్ యాక్ట్కు మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలపనుంది. యువతలో స్కిల్ డెవలప్ మెంట్ కోసం ఏపీ యూత్ పాలసీ, రైతుల సమస్యలు వంటి అంశాలను కూడా మంత్రివర్గంలో చర్చకు రానున్నాయి.