‘సాహో’లో ప్రభాస్‌తో రొమాన్స్‌ చేసేది ఈమెనా..?

‘బాహుబలి 2’ చిత్రంతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న యూనిట్‌ అంతా కూడా ఇప్పుడు తాము పడ్డ కష్టానికి హాయిగా ఫారెన్‌ వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు. బాహుబలుడు ప్రభాస్‌ ప్రస్తుతం అమెరికాలో సెలవులను ఆశ్వాదిస్తూ ఉన్నాడు. అక్కడ హాయిగా సేద తీరిన తర్వాత తిరిగి వచ్చి ‘సాహో’ చిత్రంలో నటించనున్నాడు. దర్శకుడు సుజిత్‌ ప్రస్తుతం ‘సాహో’ చిత్రానికి సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. నటీనటుల ఎంపిక చేస్తున్న యూనిట్‌ ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన రొమాన్స్‌ చేయడానికి ఓ బాలీవుడ్‌ భామను ఎంపిక చేయాలని గాలింపులు చేపట్టారు.

ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ తారలను సంప్రదించిన యూనిట్‌ తాజాగా కత్రీనా కైఫ్‌ను సంప్రదించారట. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి హిందీతో పాటు తెలుగులో కూడా మంచి పేరు ఉంది. అందుకే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన రొమాన్స్‌ చేయడానికి కత్రీనా కైఫ్‌ను ఎంపిక చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ అమ్మడు ఇంకా డేట్స్‌ ఇవ్వలేదని, కుదిరితే మళ్లీ కబురుపెడతానని యూనిట్‌కు చెప్పిందట. యూనిట్‌ మాత్రం ఎలాగైనా కత్రీనాను ఒప్పించే ప్రయత్నం చేయాలని గట్టిగా డిసైడ్‌ అయ్యారు.