దేశ వ్యాప్తంగా బాహుబలి 2 సంచలనం రేపుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటివరకు తెలుగు లో ఎలాంటి గ్రాఫిక్స్ చిత్రం రాకపోయేసరికి సినీ జనాలంతా ఈ మూవీ ను చూడడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా చూడకపోతే మనం జీవితం లో ఏదో తప్పు చేశామని భావన తో చూడడం విశేషం.
తాజాగా చెన్నై అంబత్తూరులోని ‘ఆనందం’ వృద్ధాశ్రమంలో 101 మంది వృద్ధులకు మదర్స్డే కానుకగా ‘బాహుబలి 2 ‘ను ప్రదర్శించనున్నారు. సినిమా రిలీజ్ రోజు నుండే వీరంతా సినిమా ను చూడడానికి ఆసక్తి కనపరుస్తుండడం తో ఓ యువజన సామాజిక స్వచ్ఛంద సంస్థ వారికీ సినిమా చూపించేందుకు మమ్ముందుకు వచ్చింది. ఈ మేరకు అంబత్తూరులోని రాఖీ సినిమాస్ థియేటరులో వీరి కోసం 13న ‘స్పెషల్ షో’కు ఏర్పాటు చేసింది. ఎ.ఆర్.రెహ్మాన్ సోదరి ఎ.ఆర్.రెహానా ఈ బాధ్యతలు చేపట్టడం విశేషం.