ఎన్టీఆర్‌ ఆ రోజే అధికారికంగా చెప్పేస్తాడట

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్‌ మూడు పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పాడట. గతంలో ‘జనతాగ్యారేజ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరటాల, ఎన్టీఆర్‌లు మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు. అందుకే ఈ కాంభోను మరోసారి రిపీట్‌ చేయాలని భావించారు. కొరటాల శివ కూడా మహేష్‌ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌తో చేయడానికి కథ లైన్‌ను కూడా ఇప్పటికే ఎన్టీఆర్‌కు వినిపించినట్టు వినికిడి.

ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన కూడా వెలువడబోతుంది. ఈ నెల 20వ తేదీనా ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్‌, కొరటాల కొత్త మూవీ గురించి ప్రకటించనున్నారట. ఈ చిత్రాన్ని కొరటాల స్నేహితుడు మరియు డిస్ట్రిబ్యూటర్‌ అయిన సుధాకర్‌ రెడ్డి నిర్మించనున్నట్టు తెలుస్తోంది. కొరటాల, మహేష్‌ చిత్రం పూర్తి అయ్యాక వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నారట. ‘గ్యారేజ్‌’ కాంభో కాబట్టి ఈ చిత్రంపై కూడా అంచనాలు తారా స్థాయిలోనే ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా!