రాజమౌళి నెక్స్ట్ ఆ మూవీ సీక్వెల్ నేట.

బాహుబలి మూవీ తో దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది..దేశ వ్యాప్తంగా సినీ జనాలు రాజమౌళి నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడు..ఎవరితో చేస్తాడనే ఆసక్తి పెరిగింది..తాజాగా సినీ వారాగాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..రాజమౌళి తన తదుపరి చిత్రం ఈగ సీక్వెల్ అని తెలుస్తుంది.

2012 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో తెలియంది కాదు..కేవలం ఈగ అనే గ్రాఫిక్స్ మాయ తోనే సినిమా అంత సాగింది. ఇప్పుడు దానికి సీక్వెల్ తీసే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడట. ఈగను నిర్మించిన నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్ ఈ సీక్వెల్ ను కూడా నిర్మిస్తుందని అంటున్నారు. ఈ వార్తలే గనుక నిజమైతే రాజమౌళి ‘ఈగ -2’ ను ఎంత గ్రాండ్ గా తీస్తారో, ఎవరెవరు ఈ ప్రాజెక్టులో నటిస్తారో చూడాలి.