మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక , సూపర్ హీరో సాయి ధరమ్ తేజ్ లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని రెండు రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు ప్రచారం కావడం తో అభిమానుల్లోనే కాక సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఈ వార్త నిజామా..కదా అనేది కరెక్ట్ గా తెలియక అయోమయం పడుతున్నారు. ఈ నేపథ్యం లో సాయి ధరమ్ తేజ్ ఈ వార్తల ఫై ఓ క్లారిటీ ఇచ్చాడు…
“నిహారిక నేను పెళ్లి చేసుకోనున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. మేమిద్దరం చిన్నతనం నుంచి ఒకే కుటుంబంలో కలిసి పెరిగాం. ఆమె నాకు సిస్టర్ లాంటింది. మా కుటుంబసభ్యులు కూడా మమ్మల్నీ అన్నాచెల్లెళ్లుగానే భావిస్తారు. కొన్ని మాధ్యమాల్లో ఈ విషయంపై వార్తలు రావడం బాధాకరం. ఆధారాలు లేని వార్తలు మనోభావాలను దెబ్బతీస్తాయి. ఇలాంటి విషయాలు రాసేముందు ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకోంటే బాగుంటుంది. ఈ విషయం ఓ ఆడపిల్ల జీవితానికి సంబంధించిన
విషయం’ అంటూ తేజ్ అందరికి అర్ధమై రీతిలో క్లారిటీ ఇచ్చాడు. దీంతో వీరి పెళ్లి నిజం కాదని తెలిసిపోయింది.