బలుపు డైరెక్టర్ తో మరోసారి..

మాస్ మహారాజ్ రవితేజ కు డాన్‌శీను , బలుపు వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన గోపీచంద్ మలినేని తాజాగా మరోసారి రవితేజ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా గోపీచంద్ మలినేని చెప్పిన కథకు రవితేజ ఓకే చెప్పారని, కమర్షియల్ హంగులతో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వుంటుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమవుతున్నదని, ఆగస్ట్‌లో సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ పూర్తయిన వెంటనే ,గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను మొదలుపెడతారని తెలుస్తుంది.