‘ఉయ్యాలవాడ’తో రొమాన్స్‌ చేయనున్న ఐష్‌

మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైది నెం. 150’ చిత్రంతో మంచి సక్సెస్‌ను సాధించాడు. తొమ్మిది ఏళ్లు విరామం తీసుకున్న చిరుకు ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చినా కూడా వంద కోట్ల లాభాలు వచ్చాయి. దాంతో చిరు వెంటనే తదుపరి చిత్రాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. కానీ గతంలో పక్కకు పెట్టిన చారిత్రక కథ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకే ఈ చిత్రం కోసం సమాచారం అంతా సేకరిస్తున్నారు. దాంతో షూటింగ్‌ ప్రారంభం కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. కథ వరకు దర్శకుడు సురేందర్‌ రెడ్డి కసరత్తులు చేస్తు తయారు చేశాడు. ఇక ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌నే నిర్మించడానికి రెడీ అవుతున్నాడు.

ఈ చిత్రంలో చిరు సరసన ఎవరు రొమాన్స్‌ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. మొదటగా అనుష్క, శృతిహాసన్‌ను సంద్రించగా వారు నో చెప్పారు. తాజాగా చిత్ర యూనిట్‌ ఐశ్వర్యరాయ్‌ను సంప్రదించారట. ఐష్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకుందని ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. చిరుతో ఐష్‌ రొమాన్స్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. ఈ చిత్రంలో చిరు సరసన ఇద్దరు కథానాయికలు ఉండబోతున్నారు అని చిత్ర యూనిట్‌ వారు అన్నారు. వారిలో ఒకరిగా ఐష్‌ను బుక్‌ చేశారట. చిరు ఐష్‌తో రొమాన్స్‌ చేయనున్నాడు అనగానే మెగా అభిమానులు ఉబ్బితబ్బిపోతున్నారు.