ప్రజల అభీష్టం మేరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కి…

ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో భేటీ అయ్యారు. ఈ భేటీ హైదరాబాద్ లోటస్ పాండ్ లో జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీరు త్వరలోనే చేరనున్నారు. భేటీ అనంతరం ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎప్పుడో తెలుగుదేశం పార్టీని బహిష్కరించారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల అభీష్టం మేరకే చేరుతున్నామన్నారు. ప్రభుత్వం వైఫల్యం చెందిం దంటున్న చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని ప్రవీణ్ , అమర్ నాథ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.