హమ్మయ్య : ‘బాహుబలి’ లీకేజ్ పై క్లారిటీ వచ్చేసింది..

baahubali-2-leak

యావత్ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి – ది కంక్లూజన్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇప్పటికే ఈ సినిమా ఫై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. ఇలాంటి తరుణంలో నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియాలో ఈ సినిమా తాలూకు కొన్ని విజువల్స్ విడుదలై హల్ చల్ చేస్తున్నాయి. అలాగే కొంతమంది మూవీ క్లైమాక్స్ పైరసీ బారిన పడిందని ప్రచారం విస్తృతంగా జరగడం తో.. వీటన్నింటినీ గమనించిన చిత్రం నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ పైరసీ వార్తల ఫై తన ట్విట్టర్ ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు.

baahubali-2-karntaka

సినిమాను వివిధ దేశాల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది.. అక్కడి సెన్సార్ బోర్డులకు సినిమాను ప్రదర్శించడం జరిగింది. అంతేగాని ఇంకెక్కడా సినిమాను ప్రదర్శించలేదు. సినిమా పైరసీ జరగలేదు..పైరసీ ఫై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. దీంతో లీకేజ్ రూమర్లకు చెక్ పడ్డట్టైంది. ఇకపోతే సినిమాను రేపు సాయంత్రం నుండి స్పెషల్ పైడ్ ప్రీమియర్ల రూపంలో పలు చోట్ల ప్రదర్శించనున్నారు.