బాహుబలి టీం…రాజమౌళి , ప్రభాస్ , అనుష్క నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులకు దుబాయ్ లో చేదు అనుభవం చోటు చేసుకుంది…ఇటీవల చిత్ర యూనిట్ దుబాయ్ లో చిత్ర ప్రమోషన్ కార్య క్రమం చేసిన సంగతి తెల్సిందే..ఈ క్రమం లో అక్కడికి నుండి చిత్ర యూనిట్ హైదరాబాద్కు ఎమిరేట్స్ విమానంలో బయలుదేరారు. వారంతా ఎయిర్పోర్ట్ గేట్ వద్దకు చేరుకోగానే విమాన సిబ్బంది చిత్రబృందంతో అమర్యాదకరంగా ప్రవర్తించారట. ఈ విషయాన్ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘ఎమిరేట్స్ ఈకే526 విమానంలో హైదరాబాద్ బయలుదేరాం. గేట్ వద్ద ఎయిర్లైన్స్ సిబ్బంది మాతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. అందులో ఓ సిబ్బంది మాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అనిపించింది. నేను తరచూ ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తుంటాను కానీ ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.